ప్రారంభించబోయే పనుల్లో గొప్పఫలితాలు సాధిస్తారు. మనః సంతోషాన్ని పొందుతారు. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. విష్ణు సహస్రనామాలు చదివితే మంచి జరుగుతుంది.
దివ్యమైన కాలం కొనసాగుతోంది. ఉద్యోగ, వ్యాపారాల్లో శుభఫలితాలు ఉన్నాయి. పై అధికారుల ప్రోత్సాహం, తోటి వారి గుర్తింపు లభిస్తాయి. మధ్యలో స్వల్ప ఇబ్బందులు వచ్చినా ఓర్పుతో వాటిని అధిగమిస్తారు. ఆర్థిక అంశాల్లో శ్రద్ధ అవసరం. వ్యాపారంలో మేలైన ఫలితాలు ఉంటాయి. శ్రీమహాలక్ష్మి ధ్యానం శ్రేయస్కరం.