జ్యేష్ఠా పౌర్ణమి?

Blog Description

మనకు ప్రతి మాసంలో పౌర్ణమి వస్తుంది.. భగవంతుడు ని ప్రసన్నం చేసుకోవడానికి అనుగ్రహం కోసం పౌర్ణమి పూజలు విశేషంగా జరుపుకుంటారు.. అయితే ఈ జేష్ఠ పౌర్ణమి అనేది ప్రత్యేకించి కష్టాలు తీరదనికే చేసుకోవాలి..ఈ మాసంలో సోమవారం వచ్చిన అమావాస్య ని సోమవతి అమావాస్యగా జరుపుకున్నారు ఆ రోజు రావి చెట్టు ప్రదర్శనలు చేసే ప్రత్యక్షంగా నారాయణుడికి రావి చెట్టు రూపంలో పూజించారు , అలాగే ఈ మాసంలో వచ్చిన పౌర్ణమి కూడా చాలా విశేషమైన రోజు..చాలా అరుదుగా జేష్ఠ పౌర్ణమి సోమవారం రోజు కలిసి వచ్చింది.. ఇది ఎన్నో సమస్యలకు పరిహారం చేసుకునే అవకాశం ఉంటుంది... అవి ఏంటో తెలుసుకుందాము..

1. సహజంగా జేష్ఠ నక్షత్రం బలి నక్షత్రం వీళ్ళు నిత్యం శివుడికి సోమవారం ఆవు నైయి తో దీపము పెట్టడం వల్ల ఎన్నో ఆటంకాలనుండి ఉపశమనం లభిస్తుంది, అయితే ఈ సోమవారం పౌర్ణమి రోజున ఇంట్లో మొదటి సంతానం కొడుకు కావచ్చు కూతురు కావచ్చు ఏ వయసు వారు అయినా కావచ్చు ఇంట్లో ,(గుడిలో అయితే ఇంకా మంచిది ) ఆవు నైయి తో దీపారాధన చేసి శివుని అష్టోత్తరం చేయాలి... ఇలా చేస్తే వారి తో పాటు వారి కుటుంబం అంతా మంచి జరుగుతుంది.. ఒక్కరే సంతానం ఉన్న ఇంట్లో పిల్లవాడు తండ్రి ఈ దీపారాధన సంతానం పెరు తో చేసుకోవాలి...

2. తరచుగా గొడవ పడుతున్న భార్య భర్తల, విడిపోయే పరిస్థితిలో ఉన్నవారు ఈ పౌర్ణమి రోజు తల స్నానం చేసి ఇంట్లో శివుడికి , చింబిలి (బియ్యం,నువ్వులు, బెల్లం, నైయి mixcy లో వేసి పొడి చేసి ముద్దగా చేసి ఆ ముద్దలో దీపంలాగా చేసి అందులో నైయి పోసి దీపం పెట్టాలి రెండు చింబిలి ఉండలు దీపం పెట్టాలి) కొద్దిగా చింబిలి కొబ్బరికాయ నైవేద్యంగా పెట్టి సంకల్పం చెప్పుకోవాలి మీరు మీ భర్త అన్యోన్యంగా ఉండాలి అని కోరుకొని అర్ధనారీశ్వర స్త్రోత్రం 11 సార్లు పారాయణం చేసి హారతి ఇవ్వాలి... చింబలి లోని దీపం కొండెక్కాక అది కూడా ప్రసాదంగా తినవచ్చు... ఆ రోజు ఒక్కపూట అల్పాహారం తీసుకుని సాయంత్రం 6.గ దాటాక శివాలయంలో దీపారాధన చేసి చంద్రుడికి నమస్కరించు కుని రాత్రికి బోజనం చేయాలి.. (ఇది కూతురు కాపురం కోసం అని సంకల్పం చెప్పుకుని తల్లి కూడా చేయవచ్చు...)

3.. తీవ్రమైన అనారోగ్యంతో ఉన్నవారు లేక వారి పేరుతో ఎవరైనా చేయవచ్చు... మట్టితో శివలింగం అది పుట్ట మన్ను అయితే చాలా విశేషం లేదా శుభ్రంగా ఉన్న మట్టితో స్వయంగా శివలింగాన్ని చేసి ఒక ఆసనం ఏర్పాటు చేసి వైద్యనాద్ స్త్రోత్రం తో 11 సార్లు విభూదితో అర్చన చేయాలి, మ్రుతున్జయ మంత్రం (త్రయంబకం) 108 సార్లు చదవాలి, కొబ్బరి బెల్లం నైవేద్యంగా పెట్టాలి... పూజ తర్వాత ఆ శివలింగాన్ని నీటిలో కలిపి చెట్లకు పోయావచ్చు....

4. అప్పులు ఎక్కువ గా ఉంది వడ్డీ లు కట్టుకుంటూ ఎంత కి అప్పులు తీరని వాళ్ళు, ఉద్యోగం లేని వారు, ఉద్యోగం ఉన్న తగిన జీతం రాని వాళ్ళు, వ్యాపారంలో లాభాలు లేని వారు...ఇలాగే మట్టితో శివలింగాన్ని చేసుకుని బాగా అలంకరించి.. చలిబిండి నైవేద్యం పెట్టి 16 సార్లు దారిద్ర్య దహన స్త్రోత్రం పారాయనఁ చేస్తూ శివుడికి బియ్యం పిండి తో అర్చన చేయాలి... ఆ రోజు శివాలయంలో దీపారాధన ప్రదోష కాలంలో పెట్టి ప్రదోష అష్టకమ్(సత్యం బ్రవీమి) ఒకసారి చదువుకోండి... శివదర్శనం చేసుకోండి...

5. విహహం ఆలస్యం, జాతక దోషం, బుద్ధి మాంద్యం ఉన్నవాళ్లు.. బియ్యం పిండిలో గంధం కలిపి శివలింగం చేసుకుని...విభూదితో.. శివ పంచాక్షరీ స్త్రోత్రం 11 సార్లు అర్చన చేసి, పానకమ్, కొబ్బరికాయ, సుండలు నైవేద్యం పెట్టి పూజ అయ్యాక ఆ ప్రసాదం కొద్దిగా తిని పంచి పెట్టాలి. సంకల్పం లో వివాహం మంచి సంబంధం కుదరాలి అని చెప్పుకోవాలి... ఆ శివలింగాన్ని నీటిలో కలిపి తులసి మొక్కకు కానీ రావి చెట్టుకు కానీ పోయాలి...

6. కుజదోషం తో ఇబ్బందులు పడుతున్న వారు.. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉపాద లేని వారు ఆ రోజు సుబ్రమణ్య స్వామి కి బెల్లం నువ్వులు కలిపిన చింబిలి నివేదన చేసి అష్టోత్రం తో పూజ చేసి ఏకభుక్తం చేయాలి ఒక్కపూట బోజనమ్ చేసి సాయంత్రం శివాలయంలో దీపం పెట్టాలి...

7. జేష్ఠ నక్షత్రం వారు ఐదు వేపచెట్లకు నీరు పోయాలి...

8. దూరంగా ఉన్న పిల్లలు అంటే హాస్టల్ లో విదేశాల్లో ఉన్నవారి కోసం వారి కుటుంబ సభ్యులు ఈ సోమవారం అమావాస్య రోజు శివాలయంలో అబీషేకం చేయించు కోవడం మంచి, వారే కాదు శివనుగ్రహం కోసం ఎవరు అబీషేకం చేయించు కున్నా చేసినా మంచిది..

9. ఇంక చివరిగా మన శివ భక్తుల కోసం ఈ సోమవారం పౌర్ణమి రోజున బిల్వదలాలతో అర్చన చేసిన , అభేషేకం, శివ నామ స్మరణం మరింతగా శివాను గ్రహము కలిగిస్తుంది.. (ఇవన్నీ పెద్దగా సమయము ఖర్చు లేకుండా దైవానుగ్రహం పొందే మార్గాలు.. మీకు తెలిసిన వారికి కూడా చెప్పండి ఏ ఒక్కరికి ఉపయోగ పడినా ఆ పుణ్యం మీకే)